ఆర్ఎన్ఆర్ఎల్ 23 శాతం పతనం
ఆరు రోజులుగా కుంగుతూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క సారిగా కోలుకుంది. ప్రారంభంలో రూ.1000 కంటే దిగువగా ఉన్నా ఒక దశలో బీఎస్ఈలో 4.85% లాభంతో రూ.1060 దాకా దూసుకెళ్లింది. చివరకు రూ.22.95 లాభంతో రూ.1033.85 వద్ద స్థిరపడింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి మొత్తం 2.04 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయంటే ట్రేడింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.
మరోపక్క అనిల్కు చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్(ఆర్ఎన్ఆర్ఎల్)కు గట్టి దెబ్బే తగిలింది. ఆ కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఏకంగా 22.82 శాతం పతనమయ్యాయి. గురువారం రోజు రూ.68.35గా ఉన్న షేరు ధర కాస్తా రూ.15.60 కోల్పోయి రూ.52.75కు దిగజారింది. అంతక్రితం ఒకదశలో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.50నూ తాకడం గమనార్హం. రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి 37 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. మరో అడాగ్ సంస్థ రిలయన్స్ పవర్ సైతం దాదాపు 9 శాతం కోల్పోయి రూ.140.10కు దిగజారింది. అనిల్కే చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ సైతం ఇదే బాటలో పయనించి 7 శాతం మేర నష్టాల పాలయైంది. వివిధ ఇతర అడాగ్ సంస్థలకూ నష్టాలు తప్పలేదు.(పట్టిక చూడండి)
-హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ ''ఆర్ఐఎల్దే విజయమని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆ షేర్లను కొనమని మేం సిఫారసు చేస్తున్నాం. అడాగ్ కంపెనీల షేర్లకు ఒత్తిడి ఎదురుకావచ్చు'' (ప్రైవేట్ బ్రోకింగ్) వినోద్ శర్మ -ఏంజెల్ బ్రోకింగ్ (చమురు-సహజవాయువు) విశ్లేషకులు దీపక్ పరీక్ |
- మురళీ దేవ్రా, కేంద్ర పెట్రోలియమ్ శాఖ మంత్రి |
- వీరప్ప మొయిలీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి |
- సుశీల్ కుమార్ షిండే, కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి |
- ప్రణబ్ ముఖర్జీ,ఆర్థిక మంత్రి |
సహజవాయువు జాతి సంపద అని, గ్యాస్ చట్టబద్ధ యజమాని ప్రభుత్వమేనని చెప్తూ వస్తున్న ప్రభుత్వ వైఖరినే సుప్రీం కోర్టు తీర్పు పునరుద్ఘాటించింది. దేశంలోని గ్యాస్ ధరలకు ఈ తీర్పు మరింత నిలకడతనాన్ని సంతరిస్తుంది. మదుపర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. ఎరువుల రంగం సైతం లాభపడనుంది. - శ్రీకాంత్ జేనా, కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి |