ప్రాంతాన్ని బట్టీ మార్పు
తొలిసారిగా 'డైనమిక్ ప్రైసింగ్'కు శ్రీకారం

ఎలా పని చేస్తుంది: ప్రతి టవర్ వద్ద ట్రాఫిక్ తీరును పరిశీలించే 'ఇంటలిజెంట్ రియల్ టైమ్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ కాల్ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు విశ్లేషించి ప్రతి గంటకు అక్కడ నుంచి చేసే కాల్స్పై రాయితీ రేటును నిర్ణయిస్తుంది. చందాదారులకు తక్కువ ధరకు కాల్ చేసుకునే అవకాశం కల్పించడంతోపాటు కంపెనీకి కూడా దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. నెట్వర్క్ను సమర్థంగా వినియోగించుకోవడానికి వీలుంటుంది. కాల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సాయంత్రం 6-8 మధ్య రద్దీని తగ్గించడానికి, ఇతర ప్రాంతాలకు మళ్లించడానికి దోహదం చేస్తుంది. సేవల నాణ్యత పెరుగుతుంది. 'ఒక టవర్ పరిధి నుంచి మరో టవర్ పరిధిలోకి వెళ్లినప్పుడు ప్రారంభమైన చోట రాయితీనే కొనసాగుంది. దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల్లో 20 మంది ఆపరేటర్లు డీపీ పథకాన్ని అమలు చేస్తున్నారు. మూడు నెలలు పరిశీలించిన అనంతరం దీన్ని ప్రవేశపెట్టామ'ని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మార్కెటింగ్ అధిపతి సతీశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తమ నెట్వర్క్ సామర్థ్యంలో 10-20 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నామని, భవిష్యత్తులో రద్దీ పెరిగినప్పటికీ.. కొత్త టవర్లు అవసరం లేకుండా సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి ఈ పథకం దోహదం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మార్చి చివరి నాటికి యూనినార్కు 4.6 లక్షల మంది చందాదారులు ఉన్నారు.