ఈ ఏడాది వ్యాపార లక్ష్యం రూ.19,000 కోట్లు
ఎల్సీడీ, మొబైల్ ఫోన్ల మార్కెట్పై దృష్టి
త్వరలో 3డీ టెలివిజన్

ఎల్సీడీ విపణిలో 35% వాటాపై కన్ను: ఎల్సీడీ టెలివిజన్ల మార్కెట్లో ఈ ఏడాది చివరకు అగ్రస్థానం దక్కించుకోవాలని ఎల్జీ భావిస్తోంది. కొత్తగా 25 మోడళ్లను విడుదల చేయనుంది. విలువ ఆధారంగా ఎల్సీడీ విపణిలో కంపెనీకి ప్రస్తుతం 30 శాతం వాటా ఉండగా.. దీన్ని 35 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు మూడు నెలల్లో 3డీ టెలివిజన్ను కూడా ఎల్జీ విడుదల చేయనుంది. ప్రారంభంలో ఈ టెలివిజన్ ధర సాధారణ టీవీ కన్నా 30-40 శాతం అధికంగా ఉండవచ్చని వర్మ తెలిపారు. 3-4 మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ మార్కెట్పైనా కంపెనీ దృష్టి కేంద్రీకరించనుందని చెప్పారు.
అమ్మకాల్లో 45% వృద్ధి లక్ష్యం
ప్రస్తుత ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.19 వేల కోట్లకు చేరగలవని కంపెనీ అంచనా వేస్తోంది. గత ఏడాది (2009) అమ్మకాలు రూ.13,089 కోట్లతో పోలిస్తే ఇది 45 శాతం అధికం. 2008లో విక్రయాలు రూ.10,730 కోట్లు మాత్రమే. గత ఏడాది ప్రకటనలపై రూ.550 కోట్లు ఖర్చు చేయగా.. ఈ సారి దీన్ని రూ.750 కోట్లకు పెంచారు.